రాజమౌళి మల్టీస్టారర్ పై మరో షాకింగ్ న్యూస్..!

Vasishta

రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. నిన్నటి వరకు స్టోరీపై రకరకాల కామెంట్స్ వినిపిస్తే... ఇప్పుడు బడ్జెట్ 250 కోట్లు అంటూ కొత్త టాక్ ఊపందుకుంది. రాజమౌళి ఏం తీసినా భారీగానే ఉంటుందనే నేపథ్యంలో రామ్ చరణ్ – తారక్ ల మల్టీస్టారర్ అంతకుమించిన బడ్జెట్ తో రూపుందుతుందనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.


టాలీవుడ్ లో రాజమౌళి సినిమాకి.. భారీ క్రేజ్ ఉంది. దీనికి స్టార్స్ హీరోస్ యాడ్ అయితే ఆ కిక్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. ప్రజెంట్ జక్కన్న తెరకెక్కించే ఎన్టీఆర్ - చెర్రి మల్టిస్టారర్ పై ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఏ విషయం తెలిసినా హాట్ న్యూస్ అయిపోతుంది. రీసెంట్ గా రామ్ చరణ్ కథనే వినలేదు అంటే విజయేంద్ర ప్రసాద్ ఇంకా వండటంలోనే ఉన్నారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 250 కోట్ల దాకా అవుతుందని... దానికి తగ్గట్టు దానయ్య ప్రిపేర్ కావాలని రాజమౌళి చెప్పినట్టు కొత్త టాక్ ఊపందుకుంది.


రాజమౌళి మల్టీస్టారర్ బడ్జెట్ 250 కోట్లు అంటూ వస్తున్న కామెంట్ నిజమో కాదో నిర్ధారించే సోర్స్ ప్రస్తుతానికి లేదు కానీ ఈ ఫిగర్ విన్న వాళ్ళు మాత్రం షాక్ అవుతున్నారు. బాహుబలి ఊహాతీతమైన ఒక ఫాంటసీ కథ కాబట్టి బడ్జెట్ ని ఓ రేంజ్ లో పెట్టారు. స్టోరి కొత్తగా ఉండటంతో భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా దానికి బ్రహ్మరథం పట్టారు ఆడియెన్స్. కానీ ఇప్పుడు తీయబోయే మల్టీస్టారర్ ఒక కమర్షియల్ మూవీ. రెగ్యులర్ ఫార్ములాలో జక్కన్న తనదైన శైలిలో మిక్స్ చేసే హీరోయిజంతో ఉంటుంది. మరి ఇలాంటి సినిమాకి 250 కోట్ల బడ్జెట్ ఎందుకు అనే టాక్ వినిపిస్తుంది. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం కమర్షియల్ మూవీనే అయినప్పటికీ యాక్షన్ పరంగా ఇందులో భారీ కాన్వాస్ ఉందట. దాని కోసమే రాజమౌళి ఇంత బడ్జెట్ పెడుతున్నాడని ఇంటర్నల్ టాక్.


మొత్తానికి రాజమౌళి మల్టీస్టారర్ బడ్జెట్ న్యూసే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది. అయినా రాజమౌళి కంటెంట్ కి మార్కెటింగ్ ప్లాన్ కి ఎంత పెట్టినా రెండింతలు ఎక్కువే వస్తుందనే కామెంట్ వినిపిస్తుంది. కానీ దానయ్య కనీసం ఆలోచించకుండా ఈ సినిమాకి 200 కోట్లు పెట్టడానికి వెనకడుగు వేయడంలేదు అంటే తన ధైర్యం గట్టిదే అంటున్నారు. మొత్తానికి యంగ్ టైగర్ - చెర్రీల మల్టీస్టారర్ ని ఓ రేంజ్ లో తెరకెక్కించడానికి ఫిక్స్ అయ్యాడు జక్కన్న.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: