మహేష్ ప్రవర్తనలో చిరంజీవి వ్యూహాలు !

Seetha Sailaja
టాలీవుడ్ టాప్ హీరోలలో తమ అభిమానులతో అతి తక్కువ పబ్లిక్ రిలేషన్స్ కొనసాగించే హీరోలలో ప్రధమ స్థానంలో ఉంటాడు మహేష్. స్వభావ రీత్యా మితభాషి అయిన మహేష్ తన అభిమానులతో కూడ అదేవిధంగా ఉంటూ అతి తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు తన కెరియర్ కోసం ఆ పద్ధతిని మార్చుకోవాలని మహేష్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనికోసం మహేష్ చిరంజీవి వ్యూహాలను ప్రస్తుతం అనుసరిస్తున్నాడు. చిరంజీవి మెగా స్టార్ గా కొనసాగే రోజులలో తన అభిమానులతో తరుచూ సమావేశం అవ్వడమే కాకుండా తాను నటిస్తున్న సినిమాల పై తన అభిమానుల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు వారిని తాను నటించే సినిమా షూటింగ్ స్పాట్ కు రప్పించి వారితో అభిమానంగా మాట్లాడి ఓపికగా ఫోటోలు తీయించుకునేవాడు. 

ఈపద్దతి వల్ల చిరంజీవికి విపరీతమైన అభిమానుల సంఖ్య పెరిగింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ఈ వ్యూహాలను ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లు అనుసరిస్తూ తమ అభిమానుల సంఖ్య జారిపోకుండా మరింత పెంచుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. 

ప్రస్తుతం మహేష్ కు ‘భరత్ అనే నేను’ మూవీ కెరియర్ పరంగా ప్రధాన సమస్యగా మారిన నేపధ్యంలో  మహేష్ కూడ ఈమూవీ షూటింగ్ జరుగుతున్న స్పాట్ కు తన అభిమానులను పిలిపించుకుని వారితో మాట్లాడటమే కాకుండా వారితో ఓపికగా ఫోటోలు కూడ తీయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1600 మంది అభిమానులను మహేష్ ‘భరత్ అనే నేను’ సెట్స్ పై కలిసినట్లు తెలుస్తోంది. మారిన పోటీ వాతావరణంలో మహేష్ కూడ మారిపోయాడు అంటూ సెట్స్ పై ఈ వ్యవహారాన్ని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: