తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న దర్శకుల లో కొరటాల శివ ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత రామచరణ్ తో సినిమా కోసం ఒక్క కథను సిద్ధం చేసుకున్నాడు. అంతే గాకుండా దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక్క సినిమా చేయాలనీ ప్లాన్ గా ఉన్నాడు....కానీ కొరటాల కొరిక నేరవేరక పోవచ్చు అంటున్నాయి సిని వర్గాలు.
ఎందుకంటే తారక్ – చెర్రీ నెక్స్ట్ చేయబోయే సినిమాల తర్వాత రాజమౌళి మల్టి స్టారర్ కథలో నటించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో స్టార్ట్ కానుందని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో కొరటాల అల్లుఅర్జున్ తో సినిమా తియలన్ని మంచి స్టొరీని రెడీ చేసుకుంటున్నాడాట. అయితే రాజమౌళి సినిమా అయిన తర్వాత ఇద్దరి లో ఎవరు ఖాళీగా ఉంటే వారితో చేయడానికి కొరటాల ఉన్నడట. రామచరణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కథ రెడీ అయ్యే లోపు వారు ప్రస్తుతం తమ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలన్ని అనుకుంటున్నారు.