తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యంలో ‘జై లవ కుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. లవ, కుశ పాత్రలు పూర్తి స్థాయిలో ఎంట్రటైన్ మెంట్, ఎమోషన్ అయితే..జై పాత్ర మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు మొదటి నుంచి చెబుతున్నారు.
ఈ పాత్రలో ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నారట..కాకపోతే జై పాత్రనే సినిమా మొత్తానికి కీలకం అని అంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో మూడు పాత్రలు దుమ్మురేపాయి. సుమారు 40 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో వస్తున్న ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రాబట్టడం.. ప్రమోషన్స్ కోసమే చిన్న బడ్జెట్ సినిమా రేంజ్లో ఖర్చు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ‘బిగ్ బాస్’ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన చిత్రం ‘జై లవ కుశ ’ కూడా ప్రమోషన్ బాగానే చేస్తున్నట్లు కనిపిస్తుంది.
శనివారం బిగ్ బాస్ హౌజ్ లో ఎన్టీఆర్ చేసిన సందడి మామూలుగా లేదు. అయితే ఈ నెల 21 న రిలీజ్ అవుతున్న జై లవ కుశ చిత్రం రిజల్ట్ తేడా వస్తే దసరా వరకు వచ్చే భారీ ఓపెనింగ్స్తో బయ్యర్స్ సేఫ్ అయ్యేలా ప్రమోషన్ అదరగొట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే ఈ సినిమాలో క్లైమాక్స్ 15 నిమిషాలు చూస్తున్న ప్రేక్షకులు ఎంతో ఎమోషన్, థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యే విధంగా ఉండబోతుందట.
లవకుశ ఇద్దరూ ‘జై’ను చంపడానికి అతని డెన్(లంక)కు వచ్చే సీన్ హైలైట్ అని ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ జై క్యారెక్టర్ చనిపోతుందా..లేదా మంచిగా మారుతుందా అనేది సస్పెన్స్. ఈ సీన్ ఆడియన్స్కు కనెక్ట్ అయితే సినిమా బ్లాక్బస్టర్ అని చెప్పుకుంటున్నారు.