మహేశ్.. ఎన్టీఆర్..! దసరాకు దరువేసేదెవరో తెలుసా..?

Vasishta

దసరా రేసులో దూసుకొస్తున్నారు మహేశ్, ఎన్టీఆర్..! స్పైడర్ గా మహేశ్ ఎటాక్ చేయడానికి సిద్ధమవుతుంటే ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో జై లవకుశ అంటున్నాడు. ప్రీ రిలీజ్ బడ్జెట్ లో ఇప్పటికే ఈ రెండు సినిమాలూ వంద కోట్ల మార్క్ రీచ్ అయ్యాయి. దీంతో ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి.


టాలీవుడ్ లో సరికొత్త విజన్ కి ఎన్టీఆర్ శ్రీకారం చుడుతున్నాడు. మూడు కేరక్టర్లతో జై లవకుశగా ఫ్యాన్స్ ను కట్టిపడేసేందుకు దూసుకొస్తున్నాడు. తాతగారు నటించిన దానవీర శూరకర్ణ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నిర్మాత కల్యాణ్ రామ్ చేసిన ప్రకటనతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ రోల్ తో రచ్చ రచ్చ చేస్తున్నాడు.


జై లవకుశ బిజినెస్ ఇప్పటికే వంద కోట్ల మార్క్ కు చేరువలో ఉందని సమాచారం. ప్రీరిలీజ్ బిజినెస్ ఈ స్థాయిలో ఉంటే ఇక రిలీజ్ తర్వాత కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని బాక్సాఫీస్ అంచనా వేస్తోంది. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న మహేశ్ స్పైడర్ కూడా ఇప్పటికే 120 కోట్ల బిజినెస్ కు చేరువలో ఉన్నట్లు సమాచారం. దీంతో దసరా రేసులో ఎన్టీఆర్, మహేశ్ నువ్వానేనా అన్నట్లు పోడీపడడం ఖాయంగా కనిపిస్తోంది.


జైలవకుశగా ట్రిబుల్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఎక్కడా స్టోరీ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. పైగా మూడు కేరక్టర్లూ వేటికవే స్పెషల్ గా కనిపిస్తున్నాయి. దీంతో.. అసలీ అన్నదమ్ముల మధ్య ఎలాంటి స్టోరీ ఉండబోతోందనేది అంతు చిక్కడం లేదు. మరోవైపు స్పైడర్ కూడా హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తోంది. హై టెక్నికల్ వాల్యూస్ తో వస్తున్న ఈ సినిమాపై కూడా ఇండస్ట్రీలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి దసరా బుల్లోడెవరో చూడాలి మరి.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: