రవితేజ వాళ్ల మనోభావాలు దెబ్బతీశాడా...?
దేనికైనా రెడీ.....సినిమా హిట్టా ప్లాపా అన్నది పక్కనపెడితే మా మనోభావాలు దెబ్బతీశారంటూ బ్రాహ్మణులు ఫైర్ అవ్వడం , రోడ్డుపై రచ్చ , ఆ తరువాత కోర్టు గోడవల దాకా సాగిన ఆ కాంట్రవర్సీ మరిచిపోదామన్న మరిచిపోలేం. ఇపుడు ఆ సంఘటనను సినీ ప్రియులు మరవక ముందే బ్రాహ్మణులు ఇపుడు మళ్లీ పైర్ అయ్యారు. ఈసారి వాళ్లకు ఆగ్రహం తెప్పించింది రవితేజ నటించిన బలుపు సినిమా. మేం కోపం వచ్చి రోడ్డుమీదకి వస్తే అది కూడా కామెడీగా చూపిస్తారంటూ ఈ సినిమా టీజర్ పై బ్రాహ్మణులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన బలుపు ఈ నెల 28న విడుదల కానుంది. నిజానికి 21న విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అది కాస్త పోస్ట్ పోన్ అయింది. దీంతో 28న రవితేజ తన బలుపు చూపిస్తాడంటూ ఈ రోజు కొత్త టీజర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లో నటి్ సురేఖా వాణి మా మనోభావాలు దెబ్బతింటున్నాయ్ అన్న డైలాగ్ చెబుతుంది. ఇపుడు ఈ డైలాగ్ బ్రాహ్మణులకు మంట పుట్టించింది.
��
దేనికైనా రెడీ సినిమాకు డైలాగ్స్ రాసి కోనవెంకట్ కావాలనే మమ్మల్ని అవమాన పరిచేందుకు సీన్స్ పెట్టారని బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధి ద్రోణంరాజు రవికుమార్ సెన్సార్ కి పిర్యాదు చేశారు. టీజర్ లోనే ఇలా వుంటే సినిమాలో ఇంకెన్ని డైలాగ్స్ మాపై పేల్చారో....సినిమాను మేం చూశాకే రిలీజ్ చేయాలని ,లేకుంటే ఈనెల28న ధర్నాలు,రాస్తారోకోలు చేస్తామని ప్రకటించారు. నిజానికి ఇప్పటిదాకా సినిమా రిలీజ్ తరువాత గొడవలు అయ్యాయి. బలుపు మాత్రం రిలీజ్ కు ముందే కాంట్రవర్సీకి తెరలేపింది. మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.