పవన్ విషయంలో జూనియర్ సేఫ్

E. Rama Krishna
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న న్యూస్ పవన్ ఫ్యాన్స్ వర్సెస్ యంగ్ టైగర్ ఫ్యాన్స్. నిజానికి ఈ ఇద్దరి ఫ్యాన్స్ స్నేహపూరితంగా ఉంటారు. కానీ తాజాగా జరిగిన అభిమానుల గొడవలో పవర్ స్టార్ ఫ్యాన్ మృతి చెందటం పట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. జరిగిన హత్య క్షణికావేశంలో జరిగినప్పటికీ..అభిమానుల్లో ఈ తరహా ప్రవర్తన అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదని పవన్ అభిప్రాయపడ్డారు.

అయితే తాజాగా తెలిసన సమాచారం మేరకు పవర్ స్టార్ అభిమాని హత్య అనేది ఫ్యాన్స్ మధ్య చెలరేగిన హత్య కాదని, రాజకీయ హత్య అని చెప్పుకువచ్చారు. ఈ న్యూస్ తెలుసుకున్న పవన్ సైతం షాక్ అయ్యాడని అంటున్నారు. ఇదే న్యూస్ జూనియర్ కి సైతం అందింది. ఫ్యాన్స్ గొడవ కాకపోవటంతో జూనియర్ కొంత సేఫ్ అయ్యాడని అంటున్నారు. ఒకవేళ ఇది అభిమాని హత్య అయితే జూనియర్ సైతం ఎంతో బాధపడాల్సిన అవసరం ఉంటుంది.

అలాగే అభిమానుల క్రమశిక్షణ వ్యవహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఇదంతా జూనియర్ కి తలనొప్పి వ్యవహారమే అని అంటున్నారు. మొత్తంగా జూనియర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మృతి విషయంలో సేఫ్ అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ విషయంలో బిజిగా ఉన్నాడు. ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ని ఇచ్చింది. ఇక  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించారు. మళయాళ సూపర్ స్టార్ మోహాన్ లాల్ ఈ మూవీలో నటించటంతో ఈ మూవీపై మార్కెట్ లోనూ హైప్ క్రియేట్ అవుతుంది. జనతా గ్యారేజ్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల రూపాయల క్లబ్ లో జాయిన్ అవ్వటం అనేది గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు సైతం అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: