లోక నాయకుడు కమల్ హాసన్ , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కతున్నచిత్రం 'ఇండియన్ 2'. ఈసినిమా ప్రాంభమైనప్పటినుండి షూటింగ్ కు ఏదో రకంగా అడ్డంకి ఏర్పడుతూనే వచ్చింది దాంతో ఈచిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఆ వార్తలకు చెక్ పెడుతూ మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. కొద్దీ రోజుల క్రితం చెన్నై లో జరిగిన షెడ్యూల్ లో రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , సిద్దార్థ్ లపై ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించగా తాజాగా ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూలకొత్త షెడ్యూల్ నిన్న రాజమండ్రి లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్ పాల్గొంటున్నారు. సుమారు 20రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత కడప జిల్లాలో షూటింగ్ ను కొనసాగించనున్నారు.
భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జంవాళ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం సాలిడ్ మెసేజ్ తో సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ తెరకెక్కుతుందట. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా తెరెకెక్కుతున్న ఈ ఇండియన్ 2 ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఇక ఇదిలావుంటే ఇక కమల్ హాసన్ కు ఇదే చివరి సినిమా అయ్యే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టిన కమల్ ఈ సినిమా తరువాత రాజకీయాల్లో బిజీ కానున్నాడని సమాచారం.