మహేష్ బాబు అభిమానులకు షాక్ ఇచ్చిన 'మహర్షి' సినిమా యూనిట్..!
ఇటువంటి క్రమంలో మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చింది మహర్షి టీం. విషయంలోకి వెళితే సినిమా ధియేటర్ కి వెళ్ళినప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా మంది థియేటర్లలో సెల్ఫీలు దిగుతూ హడావిడి చేసే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ఇటువంటి ఫోటోలు మహర్షి సినిమా థియేటర్లలో తీయకుండా మొదటి రోజు నుండే నిషేధించింది సినిమా యూనిట్. ధియేటర్ లో ఏలాంటి ఫోటోలు కానీ లేక వీడియోలు తీయడం నిషేదించింది.
ఈ సంఘటనలను నియంత్రించడానికి క ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. సినిమా పైరసీ జరగకుండా నియంత్రించేందుకు ఈ బృందాన్ని రూపొందించారు. ఒకవేళ ఆలా ఎవరైనా ఫోటోలు తీస్తే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనతో మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎవరూ కూడా సినిమా ధియేటర్లో జేబులో నుంచి ఫోన్ తీయలేకపోతున్నారు.