తెలుగు ఇండస్ట్రీలో కలర్స్ ప్రోగ్రామ్ తో పరిచయం అయిన కలర్స్ స్వాతి కృష్ణవంశీ దర్శకత్వంలో ‘డేంజర్’చిత్రంతో నటిగా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత . 2008లో ఆమె నటించిన అష్టా చెమ్మా చిత్రం సక్సెస్ కావడంతో ఆమెను వెతుక్కుంటూ హీరోయిన్ ఆఫర్లు వచ్చాయి. కలర్స్ స్వాతి తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్గా తర్వాత హీరోయిన్గా ఆమె కెరీర్ కొనసాగించింది. ఇటీవల వివాహం చేసుకుంది. మలేసియన్ ఎయిర్లైన్స్ పైలట్ వికాస్తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా ఉంది. వివాహానంతరం ఆమె సినీ రంగానికి గుడ్ బాయ్ చెప్పింది. అయితే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే స్వాతి వివాహం చేసుకోవడం..సినీ పరిశ్రకు దూరం కావడం జరిగింది.
తాజాగా ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వాతికి మంచి హిట్ ఇచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ లో నటించనుంది.ఈ మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. స్వాతి పాత్ర కీలకంగా కథలో ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు చందు మొండేటి ఈ మేరకు ఇప్పటికే కథ పూర్తి చేసి షూటింగ్ కు రెడీ గా ఉన్నారు.
పీపుల్స్ మీడియా ప్యాక్టరీపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ థియేటర్లోకి వచ్చిన తర్వాత ‘కార్తీకేయ’సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట.