ఆకాశంలో సాయి పల్లవి రెమ్యునరేషన్ .. మన నిర్మాతలు తట్టుకోగలరా..?
ప్రజెంట్ సాయి పల్లవి చేతులో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి . అందులో ఒకటి జునైద్ ఖాన్ మూవీ కాగా మరొకటి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం .. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా , సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది . ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ గత సంవత్సరం మొదలైంది .. అయితే రామాయణం మొదటి పార్ట్ కోసం సాయి పల్లవి ఏకంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందని అంటున్నారు .. ఇప్పటివరకు ఈ సౌత్ హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు .. లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం తన బాలీవుడ్ తోలి మూవీ జవాన్ సినిమా కోసం 12 కోట్లే అందుకుంది .. అయితే ఈ లెక్కన పారితోష్కం పరంగా అగ్రస్థానంలో ఉండే నయన్ ను సాయి పల్లవి దాటేసిందని కూడా చెప్పవచ్చు .
అయితే సాయి పల్లవి ఇక నుంచి చేయబోయే ప్రతి సినిమాకు అంతే మొత్తంలో తీసుకుంటుందా ? ఇలా చేస్తే మనోళ్లు ఈమెను తట్టుకుంటారా ? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి .. అయితే నిజానికి సాయి పల్లవి డబ్బులు కంటే సినిమా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది .. అలాగే సినిమా ప్లాస్ అయినప్పుడు తన రెమ్యూనరేషన్లు వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి .. ఈ స్థాయిలో ఎవరు ఇవ్వగలుగుతారో వారి దగ్గరే తీసుకుంటాను ప్రతి సినిమాకు ఇంత ఇవ్వండి అంటే అది మూవీ బడ్జెట్ ని సగం పెంచేసింది .. అది తప్పు అంటుంది కూడా సాయి పల్లవి . ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.