వార్నీ.. రామ్ చరణ్ తర్వాత సుకుమార్ ఆ హీరో తో సినిమా చేయబోతున్నాడా..?

frame వార్నీ.. రామ్ చరణ్ తర్వాత సుకుమార్ ఆ హీరో తో సినిమా చేయబోతున్నాడా..?

Thota Jaya Madhuri
స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ఏ హీరోతో వర్క్ చేస్తారు..? అనే విషయం ఎప్పుడూ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి - అట్లీ - లోకేష్ కనగరాజ్ - సుకుమార్ - ప్రశాంత్ నీల్ - ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ లు ఏ హీరోలతో  వర్క్ చేస్తారు అంటూ జనాలు ఎప్పుడు తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు.  ఇప్పుడు సోషల్ మీడియాలో డైరెక్టర్ సుకుమార్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్ సుకుమార్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు .



పుష్ప2 సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు. పుష్ప2 సినిమా తర్వాత సుకుమార్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికీ తెలుసు . కాగా రామ్ చరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు సుకుమార్ . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే రంగస్థలం 2 గా ఈ సినిమా తెరకెక్కుతుంది అని అంతా అనుకున్నారు . కానీ అలా కాదు ఇది ఫ్రెష్ కంటెంట్ అంటూ తెలుస్తుంది.  అంతేకాదు ఇప్పుడు రామ్ చరణ్ తర్వాత సుకుమార్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది . అది కూడా ఒక పాన్ ఇండియా స్టార్ట్ అంటూ బయటకు వచ్చింది .



రాజమౌళితో వర్క్ చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత ఆచితూచి నిర్ణయాలు వేస్తూ ముందుకు వెళ్లాలి అంటూ డిసైడ్ అయ్యాడు.  ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడట . ఆల్రెడీ వీళ్ళ కాంబోలో "నేనొక్కడినే" సినిమా వచ్చింది . అయితే ఈ సినిమా ఎలాంటి కామెంట్స్ దక్కించుకుందో అందరికీ తెలుసు.  కాగా ఇప్పుడు ఒక సెన్సేషనల్ హాట్ టాపిక్ తో మహేష్ బాబు తో సినిమా తెరకెక్కించాలి అంటూ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి . ఈ సినిమా తెరపైకి రావాలి అంటే కచ్చితంగా మూడు నాలుగు ఏళ్లు ఈజీగా పడుతుంది. అయినా సరే ఇప్పటినుంచి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించేశాడు సుకుమార్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: