2025లో అయినా ఈ ముద్దుగుమ్మల జాతకం మారుతుందా..!

Amruth kumar
 ప్రజెంట్ మన తెలుగు చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ ముద్దుగుమ్మల హవా గట్టిగా కొనసాగుతుంది .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు చాలా మంది మన టాలీవుడ్ లో వరుస‌ అవకాశాలు అందుకుంటూ తమ సత్తా చాటుతున్నారు. అయితే టాలీవుడ్ లోనే కెరీర్ను మొదలు పెట్టి స్టార్ హీరోయిన్లుగా క్రేజ్ ను సొంతం చేసుకున్న కొంతమంది హీరోయిన్ల చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా అవకాశం కూడా లేదు. మరి కొంతమంది చేతిలో సినిమాలు ఉన్నా వారి రేంజ్ కు తగ్గ సినిమాలు కాకపోవటం గమనార్హం.
మన తెలుగులో చాలామంది హీరోయిన్లకు సక్సెస్ రేట్ డౌన్ అవటం కూడా వారి కెరియర్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కృతి శెట్టి, శ్రీలీలా మృణాల ఠాకూర్, పూజా హెగ్డే వంటి హీరోయిన్లు తమ ప్రతిభతో స్టార్ హీరోయిన్లుగా భారీ క్రేజ్‌ను అందుకున్నారు.. అయితే స్టార్‌ హీరోలకు జంటగా ఈ హీరోయిన్ లకు అవకాశాలు అయితే రావడం లేదనే చెప్పాలి. అదే విధంగా పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఈ ముద్దుగుమ్మలకు శాపంగా మారిందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
అగ్ర నిర్మాతలు కూడా బాలీవుడ్ హీరోయిన్ లేదా కొత్త భామలకే ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో కూడా ఎన్టీఆర్‌కు జంటగా రుక్మిణి వసంత్ అనే కొత్త ముద్దుగుమ్మ పేరును పరిశీలిస్తున్నారు.. అలాగే నాచురల్ స్టార్ నాని హిట్3లో ఆయనకు జంటగా కే జి ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది. అలాగే ప్రభాస్- అనురాగపూడి కాంబోలో రాబోయే భారీ సినిమాలోఇమాన్వీ ఇస్మాయిల్  అనే బాలీవుడ్ స్టార్ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది.
మహేష్- జక్కన్న కాంబో మూవీకి హాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు మ‌న టాలీవుడ్ హీరోయిన్లకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లకు 2025లో అయినా ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు వస్తాయా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇక మరి రాబోయే రోజుల్లో వీళ్ళ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చోటు చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: