అంతర్జాతీయ అవార్డుల బరిలో అక్కినేని కోడలు..!?

Anilkumar
అభిమానులకు షాకిస్తూ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళను నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అభిమానులకు షాకిస్తూఅతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు తమ సినిమాలతో బిజీగా మారారు. కాగా మొన్నటి వరకు నటిగా ఉన్న శోభిత ఇప్పుడు అక్కినేని కోడలు

 కాబోతుండటంతో ఆమెకు మరింత క్రేజ్‌ పెరిగింది. ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. అడవి శేష్‌ గుఢాచారి మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మేజర్‌,పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. అంతేకాదు ఇటివల ఆమె మంకీ మ్యాన్ తో హాలీవుడ్‌ మూవీలోనూ నటించింది.  అయితే తాజాగా ఈమె నటించిన హిందీ వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్‌' అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయ వేదికపై ఇది పోటీపడబోతోంది. తాజాగా 52వ ఎమ్మీ అవార్డుల నామినేషన్స్‌ను ప్రకటించగా.. అందులో మన దేశం

 నుంచి 'ది నైట్ మేనేజర్‌' నామినేట్ అయింది. పద్నాలుగు కేటగిరీస్‌లో భారతదేశం నుంచి నామినేట్ అయిన ఏకైక సిరీస్ ఇదే కావడం విశేషం. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. డ్రామా సిరీస్‌ కేటగిరీలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనాకు చెందిన సిరీస్‌లతో శోభిత నటించిన ఈ వెబ్ సిరీస్ పోటీపడనుంది. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఇందులో నటించినప్పటికీ శోభిత షో స్టాపర్‌గా నిలిచింది. 2016లో ఇదే పేరుతో వచ్చిన బ్రిటీష్ సిరీస్‌కు ఇది ఇండియన్ వెర్షన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: