ఎన్టీఆర్ నీల్' సినిమాపై నీల్ భార్య ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దూసుకొచ్చే సునామి సైలెంట్ గానే వుంటుందంటూ..!!

murali krishna
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర మూవీ సెప్టెంబర్ 27న రాబోతోంది. ఇప్పటికే పాటలతో హైప్ ఎక్కించేశారు. ఫియర్ సాంగ్, చుట్టమల్లే పాటకు మంచి క్రేజ్ వచ్చింది. మూడో పాటకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఇక ఈ నెల అంతా కూడా దేవర సందడే కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ తన తల్లి సొంతూరు కుందాపురకు వెళ్లాడు. కన్నడ గడ్డ మీద ఎన్టీఆర్ సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కన్నడ రాష్ట్రానికి వెళ్లడంతో ప్రశాంత్ నీల్, రిషభ్ శెట్టిలు వెంటే ఉంటున్నారు.ఇక ఎన్టీఆర్, నీల్ ఫ్యామిలీలు అయితే ఫుల్లుగా చిల్ అవుతున్నాయి. ఇరువురు బీచ్‌లంటూ తమ ఫ్యామిలీలతో కలిసి తిరుగుతున్నారు. కన్నడ ప్రకృతి అందాలను చూస్తూ ఎన్టీఆర్ చిల్ అవుతున్నాడు. నీల్ భార్య లిఖిత నీల్ తీసే సినిమాలపై పోస్టులు పెడుతూ హైప్ ఇస్తుందని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ - నీల్ ఎక్కడో కొండల మీద నిలుచొని మాట్లాడుతుండగా ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది లిఖిత. ఎన్టీఆర్ - నీల్ ఫోటోని షేర్ చేసి.. సునామి వచ్చే ముందు సైలెంట్ గా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి హైప్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోని ఎన్టీఆర్ - నీల్ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేస్తూ.. జనతా గ్యారేజ్ చేసి 8 ఏళ్ళు అయిపొయింది. శివ - ఎన్టీఆర్ కాంబో దేవర సినిమా మరో నెలలో రాబోతుంది. 

ఆ తర్వాత ఎన్టీఆర్ నీల్ సినిమా షూట్ మొదలయి సునామి క్రియేట్ చేయబోతుంది అంటూపోస్ట్చేసారు. 
దీంతో ఫ్యాన్స్ ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ - నీల్ సినిమాపై షూట్ మొదలు కాకముందే హైప్ పెంచుతున్నారు.ఎన్టీఆర్ నీల్ ఫోటోని షేర్ చేసిన మైత్రీ సంస్థ.. క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చింది. జనతా గ్యారేజ్ చిత్రానికి ఎనిమిదేళ్లు అవుతోంది.. ఇక ఈ నెలలో మళ్లీ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి దేవరతో సందడి చేయబోతోన్నారు. ఇంకొన్ని నెలల్లో మేం ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్‌తో సునామీని సృష్టించబోతోన్నామని మైత్రీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత తెరపైకి వస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతో కొరటాల శివ, ఎన్టీఆర్ మళ్లీ తమ సత్తాను చాటేందుకు వస్తున్నారు. ఈ మూవీతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా, శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉంది. దేవరకు ఇప్పటికే ఓవర్సీస్‌లో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో అన్నీ ఫుల్ అవుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: