విక్రమ్ : ఆ హీరోయిన్ కోసం మణిరత్నంను ఎంతో రిక్వెస్ట్ చేశా..!!

murali krishna
కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు విక్రమ్ లేటెస్ట్ మూవీ 'తంగలాన్‌'. రీసెంట్గా రిలీజైన ఈ చిత్రం మంచి సక్సెస్ను సాధించింది. దీంతో ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ 6న హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన విషయాల గురించి  మాట్లాడారు.ఇక ఈ ఇంటర్వ్యూ లోబాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ తో వర్కింగ్‌ గురించి విక్రమ్‌ స్పందించారు.ఆమె తనకు మంచి మిత్రురాలన్నారు. ఆమె కంటే ఎక్కువగా అభిషేక్‌ బచ్చన్‌తోనే తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. తమ కాంబోలో వచ్చిన రెండు చిత్రాల్లోనూ ముగింపు బాధాకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.''అభిషేక్‌ బచ్చన్‌ నాకు క్లోజ్‌ ఫ్రెండ్‌. దానివల్ల ఆయన కుటుంబసభ్యులతోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఐశ్వర్యరాయ్‌ మంచి మిత్రురాలు. ఆమె గొప్ప నటి. మా మధ్య చక్కని ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ ఉంది. సినీప్రియులు దానిని ఆస్వాదిస్తుంటారు. ఇప్పటివరకూ మా కాంబోలో 'రావన్‌', 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రాలు వచ్చాయి. ఆయా చిత్రాల్లో మా పాత్రల ప్రేమకథకు సరైన ముగింపు ఉండదు. రెండు చిత్రాల్లోనూ ఆమె వేరే వ్యక్తి భార్యగా కనిపిస్తారు. చివరకు నా పాత్ర మృతి చెందుతుంది. అది ఫ్యాన్స్‌ను బాధకు గురిచేస్తుంది. ఇదే విషయంపై దర్శకుడు మణిరత్నంను నేను రిక్వెస్ట్‌ చేశా. మా ఇద్దరి పాత్రలకు సంతోషకరమైన ముగింపు ఇచ్చేలా ఒకే ఒక్క సినిమా చేయమని అడిగా. దానివల్ల అభిమానులు ఆనందపడతారని చెప్పా'' అని విక్రమ్‌ తెలిపారు.
విక్రమ్‌ - అభిషేక్‌ బచ్చన్‌ - ఐశ్వర్యరాయ్‌ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం 'రావన్‌' . మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో విక్రమ్‌ పాత్ర మృతి చెందుతుంది. ఇదే కాంబోలో ఇటీవల వచ్చిన చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'. చోళుల వైభవం, ఆ సామ్రాజ్య పతనానికి కారణమైన విషయాలను తెలియజేస్తూ దీనిని రూపొందించారు. ఇందులో ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్‌, నందినిగా ఐశ్వర్యరాయ్ నటించారు. ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల నందిని మరో వ్యక్తిని పెళ్లాడాల్సి వస్తుంది. ఆదిత్య కరికాలన్‌ పాత్ర మృతితో ఈ సినిమా ముగుస్తుంది. 'తంగలాన్‌' విషయానికి వస్తే.. ఆగస్టు 15న ఈ చిత్రం దక్షిణాదిలో విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలోనే శుక్రవారం దీనిని హిందీలో విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో నే విక్రమ్ ఈ విధంగా స్పందించారు  "నేను ఇప్పటివరకు చాలా చిత్రాలు చేశాను. అందులో కష్టమైనది కోబ్రా. అనుకున్నస్థాయిలో ఆడలేదు. కానీ ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. కొన్నిసార్లు సినిమాకు ప్రశంసలు వచ్చినా కలెక్షన్స్ రావు. ఏదేమైనా కోబ్రాలో నేను చేసిన ఎన్నో సీన్స్ ఛాలెంజింగ్గా అనిపించాయి. ఇకపోతే నాకు ఒకే రకమైన పాత్రలంటే ఆసక్తి ఉండదు. నేను అలా చేస్తే నా అభిమానులు కూడా నిరాశ పడతారు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రమే భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. ఇక మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు 4 జాతీయ అవార్డులను అందుకుంది. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. కానీ నాకు కూడా అవార్డ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది." అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: