సెంటిమెంట్ గా బాలయ్య vs బాలయ్య అంటున్న డైరెక్టర్ బాబీ..!

FARMANULLA SHAIK
వరుస సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య బాబు తన 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అదిరిపోయే మాస్ సినిమా అని హింట్ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.ఇదిలావుండగా బాలకృష్ణ, బోయపాటిల కాంబో గురించి.. దానికున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ ఉర్రూతలూగించే ఈ కాంబోలో తొలిసారి సింహ వచ్చింది. అది బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఆ తర్వాత నాలుగేళ్లకు లెజెండ్ సినిమా చేశారు. ఇది కూడా హిట్ గా నిలవగా.. ముచ్చటగా మూడోసారి అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఒక్కరూ మీసాలు మెలేశారు.ఇక ఈ అఖండ మూవీని డిసెంబర్ 2న విడుదలై భారీ విజయం సాధించిందిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ  nbk109 రిలీజ్ డేట్ పై  చర్చ జరుగుతుంది.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. బాలయ్య నటించిన గత మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమా మరో హ్యాట్రిక్ కి నాంది కావాలి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పుడు మంచి సస్పెన్స్ గా మారింది.వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో చిత్రం నిలుస్తుంది అని గత కొన్ని రోజులు నుంచి ఒక బజ్ అయితే కొనసాగుతుంది. కానీ సెంటిమెంట్ డేట్ డిసెంబర్ 2న కూడా మేకర్స్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే డిసెంబర్ 2న బాలయ్య నటించిన భారీ హిట్ “అఖండ” కూడా వచ్చింది సో ఆ డేట్ ని కూడా మేకర్స్ ఇప్పుడు హోల్డ్ లో ఉంచినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే డేట్ లో వస్తుందో లేదో అనేది.ప్రస్తుతం NBK109 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఉర్వశి రౌటేలా ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇప్పుడు ఇంకొక కథానాయిక కూడా బాలకృష్ణ పక్కన చేస్తోంది అని సమాచారం. సంక్రాంతికి విడుదలైన 'సైంధవ్' సినిమాలో వెంకటేష్ తో నటించిన శ్రీనాథ్ ఇప్పుడు బాలకృష్ణ సరసన ఇంకో కథానాయికగా నటిస్తోంది అని తాజా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: