విక్రమ్ : రాజమౌళితో సినిమా చేయాలని ఉంది.. కానీ..?

murali krishna
కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు విక్రమ్ లేటెస్ట్ మూవీ 'తంగలాన్‌'. రీసెంట్గా రిలీజైన ఈ చిత్రం మంచి సక్సెస్ను సాధించింది. దీంతో ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ 6న హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు రాజమౌళితో సినిమా గురించి కూడా మాట్లాడారు.ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ..” రాజమౌళితో సినిమా గురించి చర్చలు జరిపిన విషయం వాస్తవమే.రాజమౌళి చాలా మంచి వ్యక్తి అని మేము అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటామని విక్రమ్ తెలిపారు.భవిష్యత్తులో రాజమౌళితో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నానని అయితే ప్రత్యేకంగా ఒక సినిమా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదని విక్రమ్ వెల్లడించారు.దానికి సమయం పడుతుంది. భారతదేశంలోని అత్యంత గొప్ప దర్శకుల్లో రాజమౌళి ఒకరు. మేము సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాం” అని అన్నారు. దీంతో రానున్న రోజుల్లో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని స్వయంగా విక్రమ్ హింట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ప్రస్తుతం సినిమాలకు భాషతో సంబంధం లేదని నాకూ తెలుగు వాళ్లతో వర్క్ చేయాలని ఉందని విక్రమ్ చెప్పుకొచ్చారు. తంగలాన్ మూవీ కంటెంట్ విషయంలో మేము కాన్ఫిడెన్స్ తో ఉన్నామని అన్ని సినిమాలకు థియేటర్లు దొరుకుతాయని అనుకుంటున్నానని విక్రమ్ కామెంట్స్ చేశారు."నేను ఇప్పటివరకు చాలా చిత్రాలు చేశాను. అందులో కష్టమైనది కోబ్రా. అనుకున్నస్థాయిలో ఆడలేదు. కానీ ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. కొన్నిసార్లు సినిమాకు ప్రశంసలు వచ్చినా కలెక్షన్స్ రావు. ఏదేమైనా కోబ్రాలో నేను చేసిన ఎన్నో సీన్స్ ఛాలెంజింగ్గా అనిపించాయి. ఇకపోతే నాకు ఒకే రకమైన పాత్రలంటే ఆసక్తి ఉండదు. నేను అలా చేస్తే నా అభిమానులు కూడా నిరాశ పడతారు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రమే భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. ఇక మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు 4 జాతీయ అవార్డులను అందుకుంది. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. కానీ నాకు కూడా అవార్డ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది." అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: