బిగ్ బాస్-8: హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది వాళ్లేనా.. ప్లాన్ మామూలుగా లేదుగా..?

Divya
బిగ్ బాస్ షో మొదలు కాకముందే అప్పుడే ఫీవర్ మొదలైంది.. తెలుగు ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కంటిస్టెంట్ లో ఎంపిక కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వస్తారు అనే విషయం పైన పలు రూమర్స్ అయితే ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్రేజీ కంటిస్టెంట్ల పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అలనాటి హీరో అబ్బాస్, వినోద్ కుమార్, సాయి కిరణ్, సన ,విష్ణు ప్రియ, శ్వేత నాయుడు, బబ్లు, సుప్రీత ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి.

ఇదంతా ఇలా ఉండగా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి బిగ్ బాస్ నిర్వాహకులు ప్రత్యేకమైన కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.యూత్ ని ఆకర్షించే విధంగా పలు రకాల కార్యక్రమాలు చేయబోతున్నారట. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిని కంటెస్టెంట్లుగా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు షో నిర్వహణ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా సెలక్షన్ చేసే వారిలో వారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా సమాచారం.

అందుకు గల కారణం ఏమిటంటే సోషల్ మీడియాలో వీడియోస్ మిమ్స్ వంటి వాటితో బిగ్ బాస్ షో కూడా మంచి వైరల్ గా మారుతుంది. వీరు చేసేటువంటి రచ్చ కూడా ట్రెండీగా అవుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా ఆలోచించి ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో అనేది ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారట. దీని పరంగా రేటింగ్ పెంచుకొనే పనిలో కూడా బిగ్బాస్ షో నిర్వాహకులు చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లో రేటింగ్ కాస్త తక్కువగా వచ్చిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే హౌస్ లో వచ్చే కంటిస్టెంట్లలో  40 శాతానికి పైగా ఇన్ఫ్లు ఇయర్స్ ని ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉన్నదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: