మరో హిట్ డైరెక్టర్ ని పట్టేసిన రామ్?

Purushottham Vinay

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని తన కొత్త సినిమా డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.వరుస ప్లాపులతో ఉన్న రామ్ ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. పైగా పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవుతోంది. ఈ మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ కూడా హెవీగానే ఉన్నాయి. సరైన క్యారెక్టర్ పడితే రామ్ తన పెర్ఫార్మెన్స్ తో బీభత్సం సృష్టించడం పక్కా. డబుల్ ఇస్మార్ట్ మూవీతో పూరి జగన్నాథ్ అలాంటి క్యారెక్టర్ లోనే రామ్ పోతినేనిని చూపించబోతున్నారు. ఈ మూవీ కోసం రామ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత రామ్ పోతినేని నుంచి రాబోయే సినిమా గురించి మరో ఆసక్తికరమైన టాక్ ఒకటి బయటకొచ్చింది. రామ్ పోతినేని మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం తెలుస్తోంది. గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మహేష్ సూపర్ హిట్ అందుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుంది.


ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టనున్నారని సమాచారం తెలుస్తోంది.సెట్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసేశారట. క్యాస్టింగ్ ని కూడా ఆగష్టు నెల ఆఖరుకి ఫైనల్ చేయనున్నారని సమాచారం తెలుస్తుంది. రామ్ కూడా ఈ మూవీలో క్యారెక్టర్ మేకోవర్ కోసం నెల రోజుల టైమ్ ని తీసుకోబోతున్నారని సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సినిమా జోనర్ ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రామ్ పోతినేని అయితే మాస్ ఇమేజ్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ కూడా మాస్ కథతోనే ఈ సినిమా చేస్తున్నాడనే మాట వినిపిస్తుంది.మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఆగష్టు నెలలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. మరో వైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా రామ్ ఓ సినిమా చేయాలనే ప్లాన్ చేస్తున్నారట.మహేష్ బాబుతో మూవీ కంప్లీట్ అయ్యాక ఈ సినిమాని ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: