ఆవేశంలో జరిగిపోయాయి.. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు.. సమంత ఎమోషనల్ పోస్ట్..!

lakhmi saranya
నేచురల్ స్టార్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని పట్టుమని 4 ఇయర్స్ కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకుని దూరంగా ఉంటూ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఆ మధ్య ఈ బ్యూటీ మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ తన హెల్త్ పై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ యోగా వీడియోలు, తన హాట్ ఫోటోలు వంటివి షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ...మన జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకోవాలి..మరికొన్నింటిని మార్చుకోవాలని అందరూ భావిస్తారు. అలాగే జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని కూడా అనుకుంటాము. కానీ, అవి జరిగిపోయిన తరువాత మార్చుకోవాలన్నా సాధ్యపడదు.

ఆ తరువాత వెనుతిరిగి చూసుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని సమంత స్పష్టంగా చెప్పింది. అలాగే ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు అవుతుందని, జరిగిపోయిన గతంతో పోలిస్తే తాను ఎంతో ధైర్యంగా సమస్యలపై పోరాడానన్నారు. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి అగ్నిగుండం లాంటి సమస్యలను సైతం అధిగమించామని సమంత చెప్పుకొచ్చారు. దీనతో ఆమె మాట్లాడిన మాటలన్నీ విడాకుల గురించి అని అందరికీ అర్థమైంది. కాగా ఇప్పటివరకు చై, సామ్ విడాకులపై వహిరంగంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: