బలవంతంగా టబుతో ఆ పనులు చేయించిన దర్శకుడు...?

Veldandi Saikiran
సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పినా అవసరం లేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసి.... స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ వైపుకు వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా నిలిచింది.... ఇక వయసు పైబడటంతో చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ఇక ఈ బ్యూటీ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.

తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయింది. వాస్తవానికి టబూ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఇక 1991 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూలి నెంబర్ వన్ సినిమాతో హీరోయిన్గా నటించి బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సిసింద్రీ, నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు వెళ్లి అక్కడ బిజీ హీరోయిన్ గా మారింది. ఇక ఈ మధ్యకాలంలోనే అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలో కీలకపాత్రలో కనిపించి మెప్పించింది.

ఇదిలా ఉండగా.... తాజాగా ఓ ఇంటర్వ్యూలో టబు పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా టబు మాట్లాడుతూ.... నటి షబానా ఆజ్మీ నాకు చాలా దగ్గర బంధువు. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. అలా నేను ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ డైరెక్టర్ శేఖర్ కపూర్ నన్ను చూసి... నాతో "దుష్మని" అనే సినిమా చేయాలని ఉందని చెప్పారు. కానీ అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను.

అప్పుడు నాకు చదవంటే చాలా ఇష్టం. సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ శేఖర్ కపూర్ నన్ను చాలాసార్లు అడిగి ఆ సినిమా చేయమని బలవంతపెట్టారు. చివరకు నా ఎగ్జామ్స్ పూర్తి అయ్యాక సినిమాకు సంతకం చేశాను. ఇక ఏమైందో తెలియదు సడన్ గా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అని టబు చెప్పకోచ్చారు. ప్రస్తుతం టబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: