ఆ ఆడియన్స్ పై ఎక్కువ మోజు పెంచుకుంటున్న దేవర?

Purushottham Vinay

 యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మరో రెండు నెలల్లో థియేటర్లలోకి రానుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ క్యాస్టింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో బాలీవుడ్ యాక్టర్ ఈ మూవీలో భాగం కానున్నారనే వార్త వినిపిస్తోంది.'దేవర' సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 'యానిమల్' మూవీలో విలన్ గా మెప్పించిన బాబీ.. ప్రస్తుతం బాలయ్య 109వ చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమాలోనూ నటించడానికి రెడీ అయ్యారని సమాచారం. అయితే బాబీ డియోల్ క్యారక్టర్ కు మొదటి భాగంలో అంతగా ప్రాధాన్యం లేదట. రెండో భాగంలో మెయిన్ విలన్ గా ఉంటారని సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత, ఇతర భాషల నటీనటులను తీసుకోవడం కామన్ అయింది. 


ఈ 'దేవర' మూవీలో కూడా ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ భాగమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. తారక్ లాగానే సైఫ్  కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వుంది. ఇక గుజరాతీ భామ శృతి మరాఠే, హిందీ నటుడు అభిమన్యు సింగ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.దేవర సినిమాలో ఇలా చాలా మంది హిందీ నటీనటులను తీసుకోవడం చూస్తుంటే.. 'దేవర' మూవీ మేకర్స్ ఎక్కువగా బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది నార్త్ బెల్ట్ లో సినిమాకి కచ్ఛితంగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కాకపోతే మన తెలుగు విషయానికొచ్చే సరికే కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే హిందీ ముఖాలు ఎక్కువగా కనిపించడం వల్ల నేటివిటీ మిస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.కొరటాల శివ 'దేవర' చిత్రాన్ని యూనివర్సల్ గా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: