ఆ పాత్రలు ఇకపై చేయకూడదు అని డిసైడ్ అయ్యాను.. అలాంటి పాత్రలపై అనసూయ కామెంట్స్..!

Pulgam Srinivas
యాంకర్ గా కెరియర్ ను మొదలు పెట్టి నటిగా అద్భుతమైన స్థాయికి ఎదిగిన అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె పుష్ప పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో ఈమెకు తెలుగు తో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె ఇటు సినిమాలకు , అటు యాంకరింగ్ కు టైమ్  ను కేటాయించడం ఇబ్బంది కావడంతో కొంత కాలం పాటు టీవీ షో లకు దూరంగా ఉండి కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.

ఇక మళ్ళీ ఈమె టీవీ షో లలో కూడా పాటిస్పేట్ చేస్తుంది. అలాగే సినిమాలలో కూడా నటిస్తుంది. తాజాగా అనసూయ ఈ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తాను కొన్ని పాత్రలు చేయకూడదు అని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అనసూయ మాట్లాడుతూ ... నేను కెరియర్ ప్రారంభంలో క్షణం అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. అందులోని నా పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

ఇక ఆ సినిమా తర్వాత నాకు చాలా పోలీస్ పాత్రల అవకాశాలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో నేను రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించాను. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఆ పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆ మూవీ అనంతరం నాకు సినిమాలలో అత్త పాత్రలు రావడం మొదలు అయింది. దానితో నేను ఒక సినిమాలో నటించి , ఆ పాత్రకు మంచి పేరు , గుర్తింపు వచ్చినట్లు అయితే అలాంటి ఆఫర్లే మళ్ళీ కనుక వస్తే అలాంటి పాత్రలు చేయకూడదు అని డిసైడ్ అయినట్లు ఆమె తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: