"మెగా 157" కోసం ఫైట్ చేస్తున్న ఆ ముగ్గురు దర్శకులు.. చిరు ఎవరి సైడ్ ఉండనున్నాడు..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ఆగస్టు 22 వ తేదీన అనగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీ లోను , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో మూవీలోను నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువబడింది. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందబియే మూవీ క్యాన్సల్ అయింది. ఇక మల్లాడి వశిష్ట దర్శకత్వంలో మాత్రం మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ చిరు కెరియర్ లో 156 మూవీ. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే చిరంజీవి హీరోగా రూపొందుతున్న "విశ్వంభర" మూవీ చివరి దశకు చేరుకున్న తన తదుపరి మూవీ మాత్రం చిరు ఇప్పటివరకు ఓకే చేయలేదు. ఇక చిరంజీవి 157 మూవీ ఆదర్శకుడితో ఉంటుంది , ఈ దర్శకుడుతో ఉంటుంది అని అనేక మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.

కొన్ని రోజుల క్రితం హరీష్ శంకర్ "మెగా 157" మూవీ కి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు ఆయన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతి , చిరు హీరోగా మెగా 157 మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మోహన్ రాజ , చిరు కోసం ఓ కథను ఆల్మోస్ట్ రెడీ చేసినట్లు ఈయన దర్శకత్వంలోనే మెగా 157 మూవీ ఉండబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా చిరు నెక్స్ట్ మూవీ కోసం హరీష్ శంకర్ , మారుతి , మోహన్ రాజా ముగ్గురు దర్శకులు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: