మరో రెండు మూవీలకు నితిన్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్లు ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నితిన్ ఈ మధ్య కాలంలో వరస అపజాయలతో బాక్సాఫీస్ దగ్గర చాలా డీలా పడిపోయాడు . కొంత కాలం క్రితం ఈయన మాచర్ల నియోజకవర్గం అని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోగా నటించాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత ఈ నటుడు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఇక ప్రస్తుతం నితిన్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 
ఈ మూవీ తో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే మరో మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లతో నితిన్ ఏకకాలంలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇలా ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న నితిన్ మరో రెండు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ దర్శకుడు 90'S ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఓ మూవీ లోను , అలాగే విక్రమ్   కే కుమార్ దర్శకత్వంలో మరో మూవీ లోను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ రెండు మూవీలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే నితిన్ ప్రస్తుతం నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమ్ముడు సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఇంకా మూవీ బృందం అధికారికంగా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: