కొత్త వాళ్ళతో అనుకున్న సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లోకి ఇద్దరు స్టార్స్ ఎలా వచ్చారో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సినిమాలు దర్శకులు కథ రాసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటే , దానిలోకి నిర్మాతలు , హీరోలు ఎంట్రీ ఇచ్చాక ఆ కథ స్వభావం చాలా వరకు మారుతూ ఉంటుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట. అసలు ఈ మూవీ విషయంలో ఏమి సంఘటనలు జరిగాయి అనే విషయాలను తెలుసుకుందాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈయన ఈ సినిమా కథ మొత్తం తయారు చేసుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజు కు వినిపించాడట. ఇకపోతే కథ మొత్తం విన్న దిల్ రాజు కు ఈ సినిమా కథ అద్భుతంగా నచ్చిందట. దానితో శ్రీకాంత్ అడ్డాల ను సినిమా కథ బాగుంది , ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడట. దానితో ఆయన గతంలో కొత్త బంగారు లోకం సినిమాను దాదాపు అంతా కొత్తవాళ్లతో చేశాం. అలాగే ఈ సినిమాను కూడా అంత కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని ఆలోచనను దిల్ రాజు కు శ్రీకాంత్ చెప్పాడట. దానితో దిల్ రాజు "కొత్త బంగారులోకం" లాగా ఈ సినిమాను అంతా కొత్త వాళ్లతో చేస్తే రిజల్ట్ తేడా కొట్టే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాను స్టార్ హీరోలతో చేస్తే బాగుంటుంది అని అన్నాడట. దానితో శ్రీకాంత్ నాతో వెంకటేష్ ఈ మధ్య చాలా కాలంగా టచ్ లో ఉన్నాడు. ఆయన ఈ కథ విన్నాడు చేయడానికి కూడా ఆయన ఆసక్తిని చూపిస్తున్నాడు.  రెండవ పాత్రకు ఒక స్టార్ హీరోని వెతికితే సరిపోతుంది అని శ్రీకాంత్ అన్నాడట. దానికి మనం పవన్ లేదా మరెవరైనా స్టార్ హీరోను రెండవ పాత్రకు అడుగుదాం అని దిల్ రాజు అన్నాడట. అలా అనుకోకుండా ఒక రోజు ఈ కథను మహేష్ కి చెప్పడం , ఆయన కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అలా కొత్త వాళ్లతో చేద్దాం అనుకున్న ఈ సినిమాలోకి స్టార్ హీరోలు అయినటువంటి వెంకటేష్ , మహేష్ ఎంట్రీ ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: