ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఏకంగా ఆ క్రేజీ బ్యానర్లో మూవీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ ఈ మధ్య కాలం లో వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిలా పడిపోయాడు. వరుసగా ఈయన నటించిన గండివా దారి అర్జున , ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం తో ఈ నటుడు అర్జెంట్ గా ఓ భారీ హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వరుణ్ "మట్కా" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ నుండి మేకర్స్ ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వరుణ్ తేజ్ మరో సినిమాని సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా టచ్ చేసి చూడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

ఇకపోతే టచ్ చేసి చూడు మూవీ దర్శకుడు అయినటువంటి విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ తేజ్ తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి మూవీ సంస్థ వారు రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt

సంబంధిత వార్తలు: