మీకు దమ్ముంటే వాళ్ళని అనండి.. అనసూయ షాకింగ్ ట్వీట్..!

lakhmi saranya
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యింది అనసూయ. అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఈమె ఏం మాట్లాడుతున్నా కూడా నెట్జన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటి మీద కూడా ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

అనసూయ కి ధైర్యం చాలా ఎక్కువే ఎవరైనా ఆమెను ట్రోల్స్ చేసినప్పుడు కూడా వారికి ధీటుగానే సమాధానం చెప్తాది. వివాదాస్పద హంసాల గురించి మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియదు , కానీ, ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో "మరి ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు ఆ టాపిక్ గురించే మాట్లాడతారు మీకు దమ్ముంటే వారిపైన చూపించండి నామీద కాదు కానీ, మీరు అలా చేయరు కదా .

ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం . మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా " అంటూ రాసుకు వచ్చింది . ఇది చూసిన నటిజన్స్ మీరు ఎవరి గురించి పెడితే వారి పేరు టాగ్ చేసి పెట్టొచ్చు కదా ఇలా అర్థం కాకుండా పెట్టడం ఎందుకంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ పోస్టును చూసిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: