సినిమా లేకున్నా పర్లేదు.. కానీ నాగార్జున నిర్ణయాలతో టెన్షన్ పడుతున్న అక్కినేని ఫ్యాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఉంది. ఈయనకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఇకపోతే ఇంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ , గొప్ప క్రేజ్ ఉన్న నాగ్ చేస్తున్న కొన్ని పనుల వల్ల ఆయన అభిమానులు నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నాగార్జునకు హీరోగా అద్భుతమైన గుర్తింపు ఉంది. అయినా కూడా ఈ మధ్య కాలంలో సినిమాల్లో కీలక పాత్రల్లో , ముఖ్య పాత్రలో నటించడానికి శ్రద్ధ వహిస్తున్నాడు.

అందులో భాగంగా కొంత కాలం క్రితం హిందీ లో రూపొందిన బ్రహ్మాస్త్ర అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఇకపోతే ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా కుబేర అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో కూడా నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక వరుసగా సినిమాల్లో హీరోగా నటించకుండా కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో , ఇప్పుడు ఏకంగా విలన్ పాత్రలో నటించడానికి నాగార్జున రెడీ అయ్యాడు అని వార్తలు రావడంతో ఆయన అభిమానులు సినిమాలు చేయకుండా ఉన్న పర్లేదు కానీ వేరే వాళ్ళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ఎందుకు. ఆయన క్రేజ్ వేరు. ఆయన క్రేజ్ ముందు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే వందల కోట్ల కలెక్షన్లు వస్తాయి. అందుకే ఆయన హీరోగా సినిమాలు చేయడం ఎంతో మంచిది అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: