నార్త్ ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన "మిస్టర్ బచ్చన్" యూనిట్..?

MADDIBOINA AJAY KUMAR
మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరంలో ఈగల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు మూవీ బృందం మొదట ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఇదే సీజన్ కి అనేక సినిమాలు విడుదల ఉండడంతో ఎవరైనా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటే వారికి సోలో విడుదల తేదీని ఇస్తాము అని నిర్మాతలు ప్రకటించడంతో ఈ మూవీ సంక్రాంతి బారి నుండి తప్పుకుంది.

ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో సోలోగా విడుదల అయింది. అయిన కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇకపోతే ఈ సంవత్సరం ఈగల్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా , హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సంస్థ కేవలం ఈ సినిమా యొక్క తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ హక్కులను మాత్రమే దక్కించుకున్నట్లు హిందీ హక్కులను దక్కించుకోలేక పోయినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ యొక్క నార్త్ హక్కులను ఏ డిజిటల్ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి. లేకపోతే ఈ మూవీ ని హిందీ లో విడుదల చేయకుండా కేవలం నాలుగు భాషలలో మాత్రమే విడుదల చేస్తారా అనేది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: