స్పైడర్ కథకి మొదట అనుకున్న దర్శకుడు ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడితో లేదా నటితో అనుకున్న సినిమాలు వేరే వాళ్లతో తెరకెక్కడం అనేది చాలా సర్వసాధారణమో. ఒక దర్శకుడితో అనుకున్న కథను మరో దర్శకుడు తెరకెక్కించడం కూడా సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన ఒక సినిమా గురించి తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం స్పైడర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ... తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే మొదట ఈ మూవీ కథ మొత్తం తయారు అయిన తర్వాత దీనిని గోపీచంద్ మలినేని , మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా మహేష్ కు ఈ స్టోరీని కూడా వినిపించాడట. మహేష్ కు ఈ స్టోరీ అద్భుతంగా నచ్చిందట. కాకపోతే ఈ స్టోరీని రాసిన మురగదాస్ తోనే సినిమా చేస్తాను అని ఆయన అనుకున్నాడట. దానితో సున్నితంగా గోపీచంద్ మాలినేని తప్పుకోవడం , ఏ ఆర్ మురుగదాస్ ఈ ప్రాజెక్టు లోకి రావడం జరిగింది అంట.

ఇకపోతే మహేష్ , మురగదాస్ కాంబోలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక మహేష్ తన తదుపరి మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ మరి కొంత కాలంలోనే స్టార్ట్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: