ఇంత శ్రద్ధగా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి అమ్మడు..?

shami
మలయాళ భామ శ్రద్ధ శ్రీనాథ్ తన యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తుంది. మలయాళంలో 2015లో కోహినూర్ అనే సినిమాతో పరిచయమై తన నటనతో అక్కడ ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంది. ఇక అక్కడి నుంచి తమిళ, తెలుగు భాషల్లో కూడా ఛాన్సులు అందుకుంటుంది. నాని గౌతం తిన్ననూరి కాంబోలో వచ్చిన జెర్సీ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచమైంది. ఆ తర్వాత ఆది సాయి కుమార్ తో కూడా ఒక సినిమా చేసింది.
రీసెంట్ గా వెంకటేష్ తో సైంధవ్ సినిమాలో కూడా నటించింది అమ్మడు. ఐతే తెలుగులో స్టార్ హీరోయిన్ గా మాత్రం క్రేజ్ తెచ్చుకోలేదు కానీ ఏదైన పాత్రకు ఇట్టే సూటయ్యేలా అయితే శ్రద్ధ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీతో పాటుగా బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబోలో వస్తున్న వీర మాస్ సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుంది. ఐతే తనని కేవలం ఒక నటిగానే చూస్తున్నారని గుర్తించిన అమ్మడు గ్లామర్ సైడ్ కూడా అవకాశాలు రాబట్టుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఫోటో షూట్స్ చేస్తూ అదరగొడుతుంది.
శ్రద్ధ శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లను పిచ్చెక్కిపోయేలా చేస్తుంది. అలా చూపించి చూపించకుండా అమ్మడు వేస్తున్న పరువాల వలలో ఎంతోమంది ఆమె ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ చిక్కుకుంటారని చెప్పొచ్చు. శ్రద్ధ కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసేందుకు సిద్ధం అనేట్టుగా ఈ ఫోటో షూట్స్ ఉన్నాయి. క్రీం కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ తో పరువాల విందు అందిస్తున్న శ్రద్ధ శ్రీనాథ్ అందాలను ప్రదర్శించడంలో కూడా శ్రద్ధగా చేస్తుంది. మరి తెలుగులో జెర్సీ హిట్ పడిగా పెద్దగా అవకాశాలు అందుకోని శ్రద్ధ మెకానిక్ రాకీ, బాలయ్య సినిమాలతో అయినా క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి. శ్రద్ధ శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటో షూట్ ఐతే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: