షాక్: ఉపాసన-స్నేహారెడ్డి మధ్య విభేదాలా..?

Divya
మెగా అల్లు ఫ్యామిలి మధ్య గత కొద్దిరోజుల నుంచి విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పైకి అంత బాగానే ఉన్నప్పటికీ లోలోపల మాత్రం విభేదాలు  రెండు కుటుంబాల మధ్య గట్టిగానే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య కూడా ఇలాంటి వాదనే జరిగింది. సోషల్ మీడియా వేదికగా కూడా మెగా అభిమానులు అల్లు అభిమానుల సైతం ఒక పెద్ద యుద్ధమే చేశారు. మెగా అభిమానులు చేసేటువంటి సవాల్కి దిటుగాని అల్లు ఫాన్స్ కూడా సమాధానాలు తెలియజేస్తూ ఉన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికలలో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా ఉండగా ఒక అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి కేవలం తన మద్దతును మాత్రమే ప్రకటించారు.. నంద్యాల వైసిపి అభ్యర్థులు తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కోసం ప్రచారంలో కూడా దిగారు అల్లు అర్జున్.. అక్కడి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా తీరు మారిపోయింది. అల్లు అర్జున్ ని ఉద్దేశించి మెగా బ్రదర్ ట్విట్ చేయడమే కాకుండా చాలా మందితో విమర్శలు చేయించేలా చేశారని వార్తలు కూడా వినిపించాయి. అలా కొద్దిరోజుల వ్యవధిలోనే మెగా అల్లుమధ్య భారీగా వైర్యం మొదలైంది అనే విధంగా వార్తలు వినిపించాయి

మెగా అభిమానులకు అల్లు ఆర్మీ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూనే ఉంది. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీటుగానే తెలియజేస్తున్నారు. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు కూడా వెళ్లినట్లు సమాచారం. జులై 20వ తేదీన మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు కావడం చేత.. అటు లావణ్య త్రిపాఠి, నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలామంది సెలబ్రిటీలు కూడా ఉపాసనకు బర్తడే విషెస్ తెలియజేశారు. అల్లు కోడలిగా ఉన్న స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు ఎలాంటి విషయాన్ని తెలపలేదు. దీంతో ఈ ఘటన మరొకసారి అటు అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని స్థాయికి చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: