అందుకే అసలు రిస్క్ చేయడం లేదు.. భారీ సినిమాల గురించి బన్నీ వాసు కామెంట్స్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బన్నీ వాసు ఒకరు. ఇకపోతే బన్నీ వాసు , అల్లు అర్జున్ , అల్లు అరవింద్ ప్రమేయం లేకుండా ఏ పని చేయడు. వారి అనుమతి తీసుకుని , వారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ విషయంలో తాను ముందడుగు వేస్తూ ఉంటాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో ఏ సినిమాను చేయలేదు. చాలా వరకు బడ్జెట్ కంట్రోల్ లో ఉండే సినిమాలను మాత్రమే చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అయినటువంటి నార్నీ నితిన్ హీరోగా రూపొందిన ఆయ్ అనే మూవీ ని తెరకెక్కించాడు.

ఇది కూడా తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమానే. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ టీం ఈ సాంగ్ విడుదల కోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇక అందులో భాగంగా బన్నీ వాసు పాత్రికేయులతో ముచ్చటించాడు. అందులో ఒక విలేకరు నుండి ఆయనకు మీరు ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల వైపు వెళ్లడం లేదు. చాలా మంది నిర్మాతలు భారీ బడ్జెట్ తో మూవీ లు చేస్తున్నారు. మీరు ఎందుకు ఆ రూట్ ఎంచుకోవట్లేదు అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి ఆయన సమాధానం ఇస్తూ ... కరోనా తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అల్లు అరవింద్ గారు వచ్చే మూడు సంవత్సరాలు చాలా క్రిటికల్ , ఇక్కడ తప్పులు వేస్తే దెబ్బ తింటావు. అందుకే చిన్న సినిమాలతో చూసి వెళ్ళు అని అన్నారు. అందుకే అలా చేశాము. ఇక ప్రస్తుతం నాగ చైతన్య తో తండెల్ సినిమా చేస్తున్నాము. దానికి 70 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మళ్లీ పెద్ద సినిమాలు చేస్తాం అని ఆయన తాజా పాత్రికేయల సమావేశంలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: