"మల్లీశ్వరి" లో ఆ చిన్న సీన్ కోసం అంత ఖర్చు చేశారా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. అలా వెంకటేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో మల్లేశ్వరి మూవీ ఒకటి. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. విజయ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే ను అందించాడు.

ఇకపోతే అప్పటికే వెంకటేష్ , విజయ్ భాస్కర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడంతో వీరి కాంబోలో రూపొందిన రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా మల్లీశ్వరి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

ఇకపోతే విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ... మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ హాల్ లో ఓ సీన్ ఉంటుంది. అందులో వెంకటేష్ , బ్రహ్మానందం ఉంటారు. ఇకపోతే ఆ సన్నివేశాన్ని ఒక పెద్ద ప్యాలెస్ లో చిత్రీకరించాం. అంత పెద్ద ప్యాలెస్ లో కూడా అంత పెద్ద డైనింగ్ హాల్ లేదు. దానితో ప్రత్యేకంగా చాలా ఖర్చు పెట్టి ఆ సన్నివేశం కోసమే ఆ డైనింగ్ టేబుల్ ను తయారు చేయించాం. ఇక ఆసిన్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది అని విజయ్ భాస్కర్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: