స్టార్ హీరోయిన్లని వణికిస్తున్న మీనాక్షి చౌదరి..?

Purushottham Vinay

2021 లో సుశాంత్ తో చేసిన ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టింది హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి. అయితే మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా ప్రముఖుల దృష్టిలో పడటంలో సఫలం అయింది మీనాక్షి చౌదరి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్‌ దర్శకుడు అయిన త్రివిక్రమ్‌ ఈమెకి ఆఫర్ ఇస్తానంటూ గతంలో ప్రకటించాడు. అన్నట్లుగానే టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో రాజీ పాత్రను ఆమెకు ఇచ్చాడు. గుంటూరు కారం సినిమాలో ప్రాముఖ్యత లేని పాత్ర అంటూ కొందరు విమర్శించినా కానీ అది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కావడం వల్ల దాని వల్ల వచ్చిన పాపులారిటీ కారణంగా వరుసగా సినిమాలకు కమిట్ అవుతోంది మీనాక్షి చౌదరి. ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ తెలుగు లో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే.


మెగాస్టార్ చిరంజీవి మూవీ కాకుండా యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందుతున్న మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమాలను కూడా ఈమె చేస్తుంది. అయితే వీటి అన్నింటి కంటే ముఖ్యంగా తమిళ  స్టార్‌ హీరో తలపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న గోట్‌ సినిమాలో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఇంకా చర్చల దశలో ఉన్నాయి. ఇక రాబోయే రెండేళ్ల కాలంలో మీనాక్షి చౌదరి నటించిన పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గుంటూరు కారం సినిమాలో గుంటూరు రాజీ పాత్ర కొట్టేసి  బిజీ హీరోయిన్ అయిపోయింది మీనాక్షి చౌదరి. ఈమె లైన్ అప్ కి తోటి స్టార్ హీరోయిన్లు కూడా వణికిపోతున్నారు. ఇక ఫెమినా మిస్‌ ఇండియా 2018 పోటీలలో హర్యానా నుంచి ప్రాతినిధ్యం వహించిన మీనాక్షి చౌదరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో ఇండియా కి ప్రాతినిధ్యం వహించిన ఈ హాట్ బ్యూటీ రన్నపర్ గా నిలిచింది. ఇక మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత మీనాక్షి చౌదరి కి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: