ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసిన విశ్వంబర.. కేవలం రెండు పనులు మాత్రమే పెండింగ్..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటిగా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన వాల్టేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా , ఆ తర్వాత భోళా శంకర్ మూవీ తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ నిర్మిస్తున్న ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయ్యింది. అలాగే ఈ మూవీ యొక్క డబ్బింగ్ పనులను కూడా ఓ వైపు పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన కేవలం క్లైమాక్స్ , రెండు సాంగ్స్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి నుండి ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మిగిలి ఉండే రెండు సాంగ్స్ ను కూడా చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. అలా ఈ మూవీ యొక్క షూటింగ్ ను మరో ఒకటి లేదా రెండు నెలల్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత పక్కా ప్లానింగ్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి , ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మూవీ బృందం ఖచ్చితమైన ప్లాన్ ను వేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: