తెలుగమ్మాయి అయినా తమిళంలో భారీ క్రేజ్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి కొంత మంది తెలుగు అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకొని ఫేడౌట్ అవుతున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.. అలా మొదట బస్ స్టాప్ సినిమాలో హీరోయిన్గా నటించిన రక్షిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ వెంటనే వరుణ్ సందేశ్ తో ప్రేమ ఎంత పని చేసే నారాయణ, నాయక్, జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం, విధి తదితర చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ వాస్తవానికి ఈ అమ్మడు తెలుగు అమ్మాయి వరంగల్ లో పుట్టింది. కానీ తమిళ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

చిన్న వయసులోనే ఓంకార్ హోస్టుగా చేసిన ఆట డాన్స్ షోలో పార్టిసిపేషన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్ని అవకాశాలలో నటించిన కూడా రానీ సక్సెస్ తమిళంలో కాయల్ అనే చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది. 2021 లో అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అయినప్పటికీ కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. హీరోయిన్ రక్షిత ఏకంగా 17 సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

కోలీవుడ్లో ఈమె పేరు మార్చుకొని మరి సినిమాలలో నటించింది. చివరిగా ఇమే శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాలో నటించింది. అచ్చ తెలుగు అమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగు హీరోయిన్ ఆయన తమిళ భారీ క్రేజ్ అందుకుంది. ఈ ముద్దుగుమ్మకు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హీరోయిన్గా అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రక్షిత ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరమయింది. అభిమానులు అయితే ఈ అమ్మడు రీ యంట్రి ఇవ్వాలని కోరుకుంటున్నారు.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది రక్షిత..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: