వావ్: జోరు పెంచుతున్న కల్కి నటి.. ఏకంగా..?

Divya
చాలా సంవత్సరాల తర్వాత అలనాటి హీరోయిన్ శోభన కల్కి సినిమాతో రీయంట్రి ఇచ్చింది. గతంలో స్టార్ హీరోల సరసన నటించిన శోభన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. మోహన్లాల్ 360వ సినిమాల శోభన నటించబోతోందంటూ కథలు కథలుగా వినిపించాయి. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం కల్కి సినిమాలో నటింపజేసి అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. వర్చువల్ టెక్నాలజీ ఇమేజ్ తరహాలో అద్భుతమైన పాత్రలో శోభన నీ చూపించి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ని ఇచ్చారు. శోభన దాదాపుగా 18 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు పరిశ్రమ లోకి రియంట్రి ఇచ్చిందట.

కల్కిలో అద్భుతమైన నటనతో ఆకర్షించిన శోభన పేరు ఇప్పుడు మరొకసారి తెలుగు సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నది.ఈ సమయంలోనే.. శోభన నటించిన క్లాసికల్ మూవీ మనిచిత్రతాఘ అనే చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని శోభన అనే డైరెక్ట్ గా ధ్రువీకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిత్రాన్ని ఫాజిల్ దర్శకత్వం వహించగా శోభన, సురేష్ గోపి మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఆగస్టు నెలలో గ్రాండ్గా రీ రిలీజ్ చేయబోతున్నారట. 1993లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

దీంతో 30 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెర పైన ఈ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఉత్తమ నటిగా కూడా అవార్డు శోభన అందుకుందట. ఆగస్టు 17న ఏడాది ఫోర్ కేలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. దీంతో అభిమానులు కూడా తెగ ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు. శోభన కల్కి సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నది. ఆ తర్వాత ఈ క్రేజీతోనే ఇమే అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు తెలుగులోనే కాకుండా మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యింది. సీనియర్ హీరోలతో ఉన్న పరిచయాల వల్ల నటి శోభనకు పలు చిత్రాలలో సహాయక పాత్రలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: