బాలయ్య ఇచ్చిన క్రేజ్ ను వేస్ట్ చేసిన కాజల్.. భారం మొత్తం ఆ మూవీ పైనే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఇక పెళ్లయిన తర్వాత ఈమె సినిమాలు మానేస్తుందేమో అని కొంత మంది అనుకున్నారు. కానీ ఈమె మాత్రం పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె కొన్నాళ్లకే గర్భం దాల్చడంతో సినిమాలకు దూరం అయింది. ఇక ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంత కాలం రెస్టు తీసుకున్న కాజల్ మళ్లీ వరుస సినిమాలలో నటించడం మొదలు పెట్టింది.

కాకపోతే ఈమెకు పెళ్లి తర్వాత నటించిన సినిమాలతో పెద్ద స్థాయిలో విజయాలు దక్కలేదు. 
అలాంటి సమయం లోనే ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. పెళ్లి తర్వాత ఈమెకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ విజయం ఈ సినిమాతో దక్కింది. ఈ మూవీ విజయంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈమె నటించిన భారతీయుడు 2 సినిమా విడుదల అవుతుంది. దానితో ఈమె మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. ఇక అనూహ్యంగా ఈమెకు సంబంధించిన సన్నివేశాలు భారతీయుడు 2 సినిమాలో కాకుండా 3 లో ఉండబోతున్నట్లు మూవీ బృందం ప్రకటించింది. దానితో ఈమెను అభిమానించే వ్యక్తుల డిసప్పాయింట్ అయ్యారు. ఇక కాజల్ భగవంత్ కేసరి మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత మాత్రం కాజల్ పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: