లక్ లో పడ్డ రాజా సాబ్ ప్రొడ్యూసర్.. మూవీ రిలీజ్ కాకుండానే కోట్లలో లాభం..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇకపోతే ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. 
జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతుంది. ఈ మూవీ వరకు ప్రభాస్ సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు , ఈ సినిమా తర్వాత ఒప్పుకోబోయే సినిమాలకు 200 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విధంగా చూసుకుంటే రాజా సాబ్ మూవీ ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. 
కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. కాకపోతే కల్కి సినిమా తర్వాత ఇది విడుదల కాబోతోంది. దానితో ఈ మూవీ నిర్మాతకు దాదాపు 50 కోట్లు హీరో రెమ్యూనరేషన్ గానే కలిసి వచ్చినట్లు అవుతుంది. అలాగే కల్కి లాంటి భారీ బ్లాక్ బాస్టర్ మూవీ తో ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగింది. అంత మంచి విజయం తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా కావడంతో రాజా సాబ్ కి భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగే అవకాశం ఉంది. దానితో కూడా ఈ మూవీ నిర్మాతకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: