అందుకే ఆదర్శకులపై ఫోకస్ పెట్టిన బన్నీ.. ప్లాన్ అదిరిందంటున్న ఫ్యాన్స్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపు కలిగిన నటులలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఆఖరుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతుంది.

ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 6 కే తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. చాలా రోజుల క్రితమే అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సడన్  అల్లు అర్జున్ , త్రివిక్రమ్ తో కాకుండా అట్లీ తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే అల్లు అర్జున్ కూడా అట్లీ ను వెళ్లి కలిసినట్లు వార్తలు వచ్చాయి. దీనితో అల్లు అర్జున్ , అట్లీ కాంబో ఫిక్స్ అయినట్లే అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఇది క్యాన్సిల్ అయింది. ఇక అల్లు అర్జున్ తన తదుపరి మూవీ నిల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

దీనితో అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబో సినిమా ఆగిపోయింది అని కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదు అని , త్రివిక్రమ్ , అల్లు అర్జున్ తో అనుకున్న సబ్జెక్ట్ స్పాన్ చాలా పెద్దది అ ,ని దాని ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పట్టబోతోంది అని , అందుకే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే లోపు స్పీడుగా ఒక మూవీ ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నట్లు అందులో భాగంగా అట్లీ తో మూవీ చేయాలి అనుకున్నట్లు , అది కుదరకపోవడంతో నెల్సన్ తో మూవీ త్వరగా కంప్లీట్ చేయాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: