ఆ హీరోల పక్కన సాయి పల్లవి ఎందుకు నటించడం లేదో తెలుసా..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి మానులలో సాయి పల్లవి ఒకరు. ఈమె మొదట తెలుగులో "డీ" అనే డాన్స్ ప్రోగ్రాం లో పాటిస్పేట్ చేసింది. ఈ షో దాని ద్వారా మంచి సాయి పల్లవి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో , హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈమె తెలుగులో కూడా ఇప్పటికే అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు సాయి పల్లవి అనేక సినిమాలలో నటించిన ఈ సినిమాలో కూడా గ్లామర్ పాత్రలో జోలికి వెళ్లలేదు. ఎప్పుడు కూడా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో అద్భుతమైన నటనకు స్కోప్ ఉన్న పాత్రలలో నటిస్తూ వస్తుంది. దానితో ఈమెకు ఇతర హీరోయిన్లతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఇది ఇలా ఉంటే ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉన్న ఎప్పుడూ కూడా స్టార్ హీరోల పక్కన ఈమె నటించలేదు. ముఖ్యంగా తెలుగులో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఈ ఆరుగురు స్టార్ హీరోలు ఉన్న వీరి పక్కన ఇంత వరకు ఈమె ఏ సినిమాలో కూడా నటించలేదు. అందుకు ప్రధాన కారణం కామన్ గానే స్టార్ హీరోల సినిమాలలో కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. హీరోయిన్ పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. అలాగే సాయి పల్లవి కూడా హీరోలను డామినేట్ చేసే రేంజ్ లో క్రేజ్ ను కలిగి ఉంది. దానితోనే ఈమె ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన నటించలేదు అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: