ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన ఐకాన్ స్టార్..?

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్‌ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్పతో గ్లోబ‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్‌ అందుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్గా పుష్ప 2 షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు బన్నీ. సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలు కనిపించనుంది. ఈ  సినిమాలో ఫాహ‌ద్ ఫాజిల్‌ కూడా పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే తెర పైకి రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు నెలకొన్నాయి.మొదట ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసిన మేకర్స్.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6 కు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులతో మేకర్స్ బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుందన్న‌ ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలైపోయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో చేయనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కోసం నెల్సన్ ఓ పాన్ ఇండియన్ స్టోరీ ని తయారు చేసి వినిపించాడని.. బన్నీకి కూడా కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా నెల్సన్.. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైల‌ర్‌ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో నెల్సన్.. బన్నీకి వినిపించిన స్టోరీకి బ‌న్ని తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో యూనివర్సల్‌ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బ‌న్ని రేసుగుర్రం మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నల్లమలుపు శ్రీనివాసరావు ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడట. ఈ క్రమంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తెగా వైరల్ అవతున్నాయి. దీంతో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.రజనీ హీరోగా వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘జైలర్‌’ మూవీకి మళ్లీ సీక్వెల్‌గా ‘జైలర్‌-2’ని తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. అప్పటిలోగా అర్జున్‌ మూవీని కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నాడు. అల్లు అర్జున్, నెల్సన్ కాంబోలో సినిమా వస్తే.. అది వేరే లెవల్‌లో ఉండబోతుందడనంలో సందేహం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప-2 తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నాడు. పుష్ప-2 తర్వాత.. పుష్ప-3 కూడా ఉండబోతుందని టాక్‌. ఆ సినిమాకు చాలా టైం తీసుకోవాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈలోగా నెల్సన్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తాడా? లేదా? తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: