భర్తను పక్కనెట్టి.. ప్రియుడుతో ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఐశ్వర్యరాయ్?

praveen
ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకొని వేరుపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అటు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ సైతం తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గానే మారిపోతున్నాయి. అయితే ఈ వార్తలు నిజం కాదు అనేలా ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్లు కలిసి ఉన్న ఫోటోలు తెరమీదకి వచ్చిన.. ఇక విడాకుల వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే విడాకుల వార్తలకు మరింత బలాన్ని ఇచ్చేలా కొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.

 కాగా ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కు విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది అంటూ వచ్చిన రూమర్లకు మరింత బలాన్ని ఇచ్చేలా.. ఇక ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే అపరకుభేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పెళ్లి వేడుకకు అమితాబ్ కుటుంబానికి ఆహ్వానం అందింది. అమితాబ్,  జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్,బిగ్ బి కూతురుతో కలిసి వచ్చారు. ఈ క్రమంలోనే ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అయితే ఈ పెళ్లి వేడుకకు ఐశ్వర్య రాయి కూడా వచ్చింది. కానీ అమితాబ్ కుటుంబంతో కలిసి రాలేదు.

 అమితాబచ్చన్ కుటుంబం వచ్చిన చాలా గ్యాప్ తర్వాత తన కూతురు ఆరాధ్యతో కలిసి అటు ఐశ్వర్యరాయ్ పెళ్లి వేడుకలో పాల్గొంది. కుటుంబంతో కాకుండా ఇలా తల్లి కూతుర్లే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో అప్పటికే అభిషేక్ ఐశ్వర్య విడిపోతున్నారని రూమర్లు మళ్ళీ తెరమిదికి వచ్చాయి.  ఇదిలా ఉండగా తన భర్త అభిషేక్ బచ్చన్ ను పక్కన పెట్టేసి ఐశ్వర్యారాయ్ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఫ్యాన్స్ ఇది చూసి షాక్ అవుతున్నారు. అయితే అసలు  ఈవెంట్ లో ఐశ్వర్య సల్మాన్ ఖాన్ తో ఫోటో దిగలేదని కేవలం అది ఎడిటెడ్ ఫోటో అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: