ట్రోలర్లకు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. ఎందుకంటే..?

Divya
తెలుగులో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు పొందిన వారిలో అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట యాక్టర్ గా ఆ తర్వాత న్యూస్ రీడర్గా యాంకర్ గా మారి నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అనసూయ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రం రంగస్థలం.. ఈ సినిమాల ఈమె పాత్ర మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ అందుకుంది ఈ హాట్ యాంకర్.. పుష్ప సినిమా తర్వాత యాంకరింగ్ కూడా గుడ్ బాయ్ చెప్పేసింది అనసూయ.

ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో పాటు ఇతర సినిమాలలో బిజీగా ఉన్నది. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ తనని ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ.  అనసూయ హీరోయిన్ సావిత్రి పాటకు బుల్లితెర పైన షోలో డాన్స్ వేయడం పైన ట్రోల్ చేశారు.. దీనిపైన యాంకర్ అనసూయ రియాక్ట్ అవుతూ తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ ను  షేర్ చేస్తూ కౌంటర్ వేయడం జరిగింది.. హలో తేజ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను నా శాంతి కోసం నేను స్పందించకూడదని అనుకుంటూ ఉంటాను .. కానీ స్పందించాల్సి వచ్చిందని తెలిపింది.

నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఛానల్ లో జరిగిన ఒక పండుగ కార్యక్రమానికి సరితం మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించానని.. నా ప్రదర్శనను నేను చూసుకోవడం జరిగింది కానీ నెట్టింట చాలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారని తెలిపింది.. నేను న్యాయమైన గౌరవప్రదమైన విమర్శలకు సిద్ధంగా ఉంటాను కానీ మహానటి సావిత్రమ్మకు నివాళులు ఇస్తున్న సమయంలో ఉద్దేశించి ఇలా గౌరవ పరచడం బాగాలేదంటూ తెలియజేసింది.. మీరు నిజంగానే  తీర్పు చెప్పాలనుకుంటే జి ఫైవ్ లో బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం అనే కార్యక్రమం ఉన్నది వాటిని చూసిన తర్వాత నా నటన నచ్చకపోతే మీరు ఏ విధంగా చేసిన ఓకే అంటే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: