3 డిమాండ్ల తో రాజ్ తరుణ్ కు షాక్ ఇస్తున్న లావణ్య..!.

Divya
హీరో రాజ్ తరుణ్ పైన మాజీ ప్రేయసి లావణ్య ఇటీవలే నార్సింగ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి కూడా తెలిసిందే.. దీంతో గత కొద్దిరోజుల నుంచి రాజ్ తరుణ్, లావణ్య ,మాల్వి మలహోత్ర పేర్లు తెగ వినిపిస్తున్నాయి.. 2008లో సోషల్ మీడియా వేదికగా మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారితీసిందట. 2014లో రాజు తరుణ్ తన వివాహం చేసుకున్నారని లావణ్య తెలిపింది. అలాగే రెండుసార్లు అబార్షన్ చేయించారని మెడికల్ బిల్లు రాజు తరుణ్ స్వయంగా చెల్లించారని కూడా తెలియజేసింది.

హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో పరిచయం ఏర్పడిన తర్వాత తనని దూరం చేశారని మూడు నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారని కూడా తెలిపింది.. దీంతో A1,A2,A3 కింద రాజు తరుణ్ మాల్దీ మల్హోత్రా ఆమె సోదరుడిని చేర్చడం జరిగింది.. ఈ ముగ్గురిపైన 420, 493,506 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఈ విచారణకు సైతం హాజరుకావాలని రాజు తరుణ్ కి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాజ్ తరుణ్ అరెస్ట్ కావడం ఖాయం అనే విధంగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా వీరి కేసులో లావణ్య మూడు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ కేసులో పోలీసుల తీరుపైన లావణ్య తీవ్రంగా అసంతృప్తిని తెలియజేసింది.. ముఖ్యంగా రాజ్ తరుణ్ మాల్విలను విచారించకపోవడం పైన ఆమె ఆవేదన తెలియజేస్తోంది.. దీంతో నిరాహార దీక్షకు కూడా దిగినట్లుగా తెలుస్తున్నది.. అయితే ఆమె మూడు డిమాండ్లను నెరవేర్చాలి అంటూ ఈ నిరాహార దీక్ష చేస్తున్నట్లు సమాచారం.. ఇందులో మొదటిది మాల్విని రాజ్ తరుణ్ విడిచి పెట్టాలి అని.. రెండవది రాజ్ తరుణ్ తనని భార్యగా అంగీకరించాలి.. మూడవది మాల్వి కుటుంబం పైన చర్యలు తీసుకోవాలంటే లావణ్య డిమాండ్ చేస్తున్నది.. ఇప్పటికీ కూడా రాజ్ తరుణ్ మాల్వి ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు అనే విధంగా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: