ఏఎన్ఆర్- రామానాయుడు గొడవ పడడానికి కారణం..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య దర్శక నిర్మాతల మధ్య చిన్న చిన్న గొడవలు అలకలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న గొడవలు తగాదాలు వంటివి పెట్టుకొని మళ్ళీ కలిసిపోయిన వారు కూడా సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మూవీ మొగల్ గా పేరు పొందిన రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావు మధ్య కూడా ఒక చిన్నపాటి గొడవ వచ్చిందట. తెలుగు సినీ పరిశ్రమను మరొక స్థాయికి తీసుకు వెళ్లిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. ఈయన స్టెప్పులు అందరిని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.

ఏఎన్ఆర్ స్టైల్ గురించి కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.అంతా ఫ్యాషన్ గా మెయింటైన్ చేస్తూ ఉండేవారు. ఏఎన్ఆర్ సినిమాలలో శ్రుతి మించిన రొమాన్స్ చేసేవారు.. కానీ డబల్ మీనింగ్ డైలాగులు పాటలు చేయవలసి వస్తే కచ్చితంగా వాటిని వ్యతిరేకించేవారట. కానీ ఒక పాట విషయంలో రామా నాయుడుకి ఏఎన్ఆర్ కి మధ్య చిన్నమాట వచ్చిందని టాక్ అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించేది.. ఆ పాటే ఏదో కాదు.. లే.. లే.. లే నా రాజా అనే సాంగ్..

ఈ పాటలో చేయవలసి వచ్చినప్పుడు ఏఎన్ఆర్ ఒప్పుకోలేదట. ఈ సినిమాకు నిర్మాత స్వయంగా ఆయన వియ్యంకుడు రామానాయుడనీ చెప్పిన కూడా ఏఎన్నార్ ఆ మాట వినలేదట. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది డైరెక్టర్ కె ప్రకాశరావు. ఈయన ఎవరో కాదు కాదు ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు తండ్రి.. ప్రకాశ్ రావు ఈ సినిమాకి ఈ పాట లేకపోతే ఒక లోటు అవుతుందని ఈ పాట వల్లే సినిమా పాపులర్ అవుతుందని డైరెక్టర్ నిర్మాత నమ్మారు కానీ ఏఎన్ఆర్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చివరికి ఏఎన్ఆర్ కు ఈ పాట వినమని అందులో మీకు ఇబ్బందికరంగా ఏదైనా అనిపిస్తే చెప్పండి అని చెప్పగా చివరికి ఏఎన్ఆర్ ఏమీ లేదని చెప్పి వదిలేశారట. అయితే మొత్తానికి ఏఎన్ఆర్ ఈ పాట లేకపోతే సినిమా చేస్తానని చెప్పారు. ఈ సమయంలో ఏం చేయాలో తెలియని ప్రకాశ్ రావుకు.. సొంతంగా ఏఎన్నార్ ఇంటికి వెళ్లి మరి బ్రతిమలాడారట దీంతో చివరికి చేసేదేమీ లేక ఒప్పుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఏఎన్ఆర్ పక్కన జ్యోతిలక్ష్మి ఈ పాటకి డాన్స్ వేయడంతో మంచి హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: