అల్లు అర్జున్ తో మూవీ అందుకే వద్దనుకున్నా.. మారుతి..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో మారుతి ఒకరు. ఈయన ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీవ్లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు గోపీచంద్ హీరో గా రాసి కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ప్రస్తుతం ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందుతున్న రాజా సాబ్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధీ కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు మారుతి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా మారుతి మాట్లాడుతూ ... కొంత కాలం క్రితం అల్లు అర్జున్ తో సినిమా చేద్దాం అనుకున్నాను. అందులో భాగంగా ఫస్టాఫ్ కథను కూడా రెడీ చేశాను.

ఆయనకు దానిని వినిపించాను. ఆయన కూడా సూపర్ గా ఉంది అన్నారు. ఇక సెకండ్ హాఫ్ చేద్దాము అనుకునే సమయంలో సుకుమార్ , అల్లు అర్జున్ కి ఓ కథ చెప్పడం , అది ఆయనకు నచ్చడం జరిగింది. దానితో అంత పెద్ద దర్శకుడితో ఆఫర్ వచ్చింది కాబట్టి నేను సైడ్ అయ్యాను. ఇకపోతే అల్లు అర్జున్ కోసం రాసిన కథ ఫస్ట్ ఆఫ్ వరకు మాత్రమే బాగా వచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఆఫ్ అంత గొప్పగా సెట్ కాలేదు. దానితో ఆ కథ ను పక్కన పెట్టేసాను అని ఈ దర్శకుడు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: